కన్ను ద్వారా ఎన్ని చూసినా మనసు ప్రశాంతంగా ఉండలేక పోతుంది.
చెవితో ఎన్ని విన్నా మనసు తృప్తి పడలేకపోతుంది.
ఎన్ని రకాల వాసనలు పీల్చినా మనసు ఇంకా ఎదో వెలితితోనే ఉండి పోతుంది.
ఎన్నో రుచులు చవి చూసిన నాలుక ఇంకేదో రుచికై వెంపర్లాడుతుంది.
మనం చూసింది, చేసింది, విన్నది, తిన్నది ఇక చాలు.
వీటి ద్వారా జీవితంలో వెలుగు రాదు అనిపిస్తుంది.
వేదన దూరం కాదు అని తెలిసొస్తుంది.
వీటితో మనసు ఎప్పటికీ శాంతి తీరాలకు చేరదు అనిపిస్తుంది.
Comments
Post a Comment